రోజులు లెక్కపెట్టుకుంటూ ఉన్నాడా?.. శ్రీదేవి అంటే ఎంత ప్రేమో!!

Boney kapoor Gets Emotional On Sridevi Birth Anniversary

అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవిది భారత సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయమే. బాలనటిగా మొదలుపెట్టి ప్రాంతీయ భాషల్లో నటించి.. దక్షిణాదిన తిరుగులేని కథానాయికగా ఎదిగింది. అటుపై బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటి.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మొదటి లేడీ సూపర్ స్టార్‌గా స్టార్డంను సొంతం చేసుకుంది. అలాంటి శ్రీదేవికి ఎటువంటి మరణం సంభవించిందో అందరికీ తెలిసిందే. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు.. బాత్ టబ్‌లో పడి శ్రీదేవి ప్రాణాలను కోల్పోయింది.

Boney kapoor Gets Emotional
Boney kapoor Gets Emotional

దుబాయ్‌లో పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి.. ఇండియాకు ప్రాణాలతో తిరిగి రాలేదు. అక్కడ బస చేసిన హోటల్ గదిలోనే ఫిబ్రవరి 24, 2018న మరణించింది. అయితే శ్రీదేవి మరణంపై ఇప్పటికీ కొంత అనుమానాలే ఉన్నాయి. అయితే నేడు అనూహ్యంగా అవి తెరపైకి వచ్చాయి. నేడు శ్రీదేవీ జయంతి. ఈ సందర్భంగా నెటిజన్లు శ్రీదేవి మరణంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరుతున్నారు.

ఇదంతా కాసేపు పక్కన పెడితే.. శ్రీదేవి జయంతి సందర్భంగా బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యాడు. ‘మమ్మల్ని విడిచి వెళ్లిన ఈ తొమ్మిది వందల రోజుల్లో ప్రతీ క్షణం నిన్ను మిస్ అయ్యాను జాన్.. అయితే ఈ రోజు మరింత మిస్ అవుతున్నా.. మన జాను గుంజన్ సక్సేనా చిత్రంలో నటించిన తీరును నువ్ చూస్తే నీ మొహంలో వచ్చే చిరునవ్వును మిస్ అవుతున్నాం. నువ్ మాతో పాటే ఉన్నావని అనుకుంటున్నాను. నువు లేకపోతే మేము సంతోషంగా ఉండలేము. హ్యాపీ బర్త్ డే నా ప్రేమ నువ్వే.. నా జీవితం నువ్వే’ అంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు. భార్య దూరమైనప్పటి నుంచి రోజులు లెక్కపెట్టుకుంటున్నాడా? నిజంగానే శ్రీదేవి అంటే ఎంత ప్రేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.