ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ది, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేదుకు చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్, సురేష్ బాబు సహా పలువురు సినీ పెద్దలు ఈనెల 9న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ పాల్గొంటారా? లేదా? అన్న దానిపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. బాలయ్య చేసిన వ్యాఖ్యలు కారణంగా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? అన్న టెన్షన్ వాతావరణం టాలీవుడ్ సహా బయటా అలుముకుంది. అయితే తాజాగా భేటీకి బాలయ్య హాజరు కావడం లేదని నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు.
బాలయ్య పుట్టిన రోజు వేడుకలు కారణంగా రావడం కుదరదని చెప్పారుట. ఇక బాలయ్య పుట్టిన రోజు జూన్ 10, సినీ పెద్దలు భేటీ నిర్వహించింది ఆ ముందు రోజు జూన్ 9 కావడం విశేషం. అయితే ఈ రెండు తేదీల నడుమ ఆసక్తికర ప్రచారం మొదలైంది. పుట్టిన రోజు కాబట్టి బాలయ్య ఎలాగూ బిజీగా ఉంటారు. అప్పుడు ఆయన ఎలాగు రాను అని అంటారు. అందుకే ఆ తేదీన అంతా ప్లానింగ్ ప్రకారమే జూన్ 9న భేటీ ఏర్పాటు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అందుకే జూన్ 9న మీటింగ్ కి ఆహ్వానించినట్లు మాట్లాడుకుంటున్నారు. కారణాలు ఏవైనా బాలయ్య సినీ పెద్దల మీటింగ్ లో లేకపోవడం అన్నది లోటే.
బాలయ్య ఉంటే ఆయనకు తోచిన సలహాలు…సూచనలు ఇచ్చేవారు. మెగా-నందమూరి అభిమానులు కూడా కాస్త శాంతించే వారు. మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంకెన్ని పెడర్ధాలు తీస్తారో? అటు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈసారి వేడుకకు సినీ పెద్దలు అందర్నీ పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఈ వేడుకల్లో చిరంజీవి, నాగార్జునని పిలుస్తారా? అన్నది మరో వైపు ఆసక్తికరమైన చర్చగా మారింది.