కృష్ణ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించిన బాలయ్య (ఫొటోలు)

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మొదటిభాగమైన ‘కథానాయకుడు’ ఇప్పటికే షూటింగును పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ‘మహానాయకుడు’ షూటింగు దశలో వుంది .. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రెండు భాగాలకు సంబంధించిన ఆడియోను రేపు విడుదల చేస్తున్నారు. అందుకోసం ఇండస్ట్రీ పెద్దలను స్వయంగా బాలయ్య వెళ్లి పిలుస్తున్నారు. అందులో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లి మరీ దగ్గరుండి ఆడియో వేడుకకు ఆహ్వానించారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక ఈ ఆడియో వేడుకకు వేదిక గా..హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ మారుతోంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. కీరవాణి అందించిన ఆడియోతో పాటు, ట్రైలర్ ను కూడా ఇదే వేదికపై లాంచ్ చేయనున్నారు.

ఎన్టీఆర్ గా బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తుండగా, విద్యాబాలన్ .. నిత్యామీనన్ .. రకుల్ … హన్సిక .. రానా .. సుమంత్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.