టాలీవుడ్ లో కమిట్మెంట్ గోల భరించలేం బాబోయ్ – అనుపమ !

Anupama Parameswaran

తెలుగు చిత్ర సీమలోనే కాదు.. అన్ని భాషల్లోనూ కథానాయికలకు కమిట్మెంట్ గోల తప్పదు.  కమిట్మెంట్ ల పేరుతో హీరోయిన్ లను విసిగించడం, వేధించడం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది కథానాయికలు ఈ విషయంలో నోరువిప్పితే, మరి కొంతమంది కామ్ గా ఉంటున్నారు. ఈ గోల అనుపమా పరమేశ్వరన్ కు తప్ప లేదట.  టాలీవుడ్ లో కమిట్మెంట్ గోల భరించలేం బాబోయ్ అంటోంది అనుపమా పరమేశ్వరన్.

Anupama Parameswaran
Anupama Parameswaran

అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే ఈ మలయాళీ ముద్దుగుమ్మ. సొంత భాషలో మూడు సినిమాలే చేసింది. ఇప్పుడు ఇంకొకటి చేస్తోంది. నిజానికి అనుకున్నంత వేగంగా లేదామె కెరీర్. మంచి నటిగా పేరున్నా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇదే ప్రశ్న రీసెంట్‌‌‌‌గా ఆమెని అడిగితే..  దానికి అనుపమ చెప్పిన విషయం విని అందరూ షాకయ్యారు. తన మనసు గాయపడటం వల్లే మాలీవుడ్‌‌‌‌కి అనుపమ దూరంగా ఉందట…”నేను తొలిసారి ‘ప్రేమమ్’ లో చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా రిలీజ్‌‌‌‌కి ముందు ప్రమోషన్‌‌‌‌కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. దాంతో అందరూ సెల్పు డబ్బా కొట్టుకుంటున్నానని అన్నారు. లెక్క చేయకపోవడంతో నాకు అహంకారం అని ట్రోల్ చేశారు. అందరూ అలా అనేసరికి చాలా హర్టయ్యాను. అప్పటికి మరీ చిన్నదాన్ని కదా. అందుకే కొన్నాళ్లు మలయాళ సినిమాలకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తమిళ,తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టాను.

అప్పుడే ‘అఆ’ సినిమాలో నెగెటివ్ రోల్ చేయమని ఆఫర్ వచ్చింది. భాష రాకపోయినా.. తెలుసుకుని మరీ ఆ క్యారెకర్ చేశాను. తెలియని దాంట్లోవేలు పెడుతున్నావని అప్పుడు కూడా అందరూ ట్రోల్ చేసారు. అయినా చాలెంజింగ్‌‌‌‌గా తీసుకుని చేశాను. తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది’ అంటూ తనెంత పట్టుదలతో ఇండస్ట్రీలో నిలబడిందో చెప్పుకొచ్చింది అనుపమ .అయితే కొన్ని చోట్ల తనకు కమిట్మెంట్ గోల తప్పలేదంటూనే.. ఇండస్ట్రీలో ఇవి మామూలే.. అంటూ కొట్టిపారేసింది.  అనుపమ పరమేశ్వర్ యువ హీరో నిఖిల్ తో త్వరలో జతకట్టనుంది. గీతా ఆర్ట్ బ్యానర్ పై బన్నీ వాసు, దర్శకుడు సుకుమార్ తాజగా ’18 పేజెస్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.