షూట్ బ్రేక్ లో…: మహేష్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇదిగో

లాడ్ డౌన్ ఎఫెక్ట్: మ‌హేష్ టెన్నీస్ ప్లేయ‌ర్

షూట్ బ్రేక్ లో…: మహేష్ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇదిగో

సూపర్ స్టార్ మహష్ బాబు తన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ షెడ్యూల్ ని రీసెంట్ గా కాశ్మీర్ లో విజయవంతంగా ఫినిష్ చేసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లో షూటింగ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ, బ్రేక్ టైమ్ లో ఎంతలా రిలాక్స్ అయ్యారో ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న వీడియో ద్వారా అర్దమవుతుంది. ఈ వీడియో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్, వంశీ పైడిపల్లి, అనీల్ రావిపూడి, మెహర్ రమేష్ కలిసి క్రికెట్ అడుతున్నది. ఈ వీడియోని అనీల్ రావిపూడి తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో షేర్ చేసారు. ఇప్పుడు సోషల్ మీడియోలో ఈ వీడియో ట్రెండింగ్ లో నిలుస్తోంది.

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మండన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మొన్నటి నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో లవ్‌ సీన్స్‌ను తీస్తారట.

అలాగే త్వరలో కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్‌కు చెందిన సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఇందుకోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఆల్రెడీ సెట్‌ వర్క్‌ని కూడా స్టార్ట్‌ చేశారని టాక్‌. కశ్మీర్‌ షెడ్యూల్‌కు ముందు అనిల్‌ రావిపూడి కర్నూలు లొకేషన్స్‌ను పరిశీలించారు. రామబ్రహ్మం సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.