క్రియేటివ్ ద‌ర్శ‌కుడి చేతిలో అఖిల్‌

వ‌రుసగా ఎదురొచ్చిన ఫ్లాప్‌ల‌తో డీలాప‌డ్డ యంగ్ హీరో అఖిల్ త‌న నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. అఖిల్ నాలుగో సినిమాకు స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టి ద‌ర్శక‌త్వం వ‌హించే ఛాన్స్ ఉంద‌ట‌. స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టి మ‌రెవ‌రో కాదు. తెలుగు, త‌మిళం భాష‌ల్లో ప‌లు హిట్ సినిమాల‌ను అందించిన ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడు. హీరోగా, విల‌న్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి సోద‌రుడు. ఇదివ‌ర‌కే స‌త్య‌ప్ర‌భాస్ త‌మిళంలో `య‌గ‌వ‌రాయినుమ్ నా కాక్క‌` సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

తెలుగులో అది `మ‌లుపు` టైటిల్‌తో విడుద‌లైంది. సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ సాధించ‌న‌ప్ప‌టికీ.. ద‌ర్శ‌కుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన మ‌లుపు మూవీలో ఆది పినిశెట్టి హీరో.మిస్ట‌ర్ మ‌జ్ను సెట్స్ మీద ఉన్న స‌మ‌యంలోనే అఖిల్‌కు స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌గా ఓ థ్రిల్ల‌ర్ పాయింట్‌ను చెప్పార‌ట‌. అఖిల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో స‌త్య‌ప్ర‌భాస్ ఆ పాయింట్‌ను డెవ‌ల‌ప్ చేశార‌ని చెబుతున్నారు. తెలుగులో అఖిల్‌తోను, త‌మిళంలో ఆది పినిశెట్టితోనూ ఈ మూవీ ఒకేసారి సెట్స్‌పైకి వెళ్లొచ్చ‌ని అంటున్నారు.