ఇక టాలీవుడ్ పై గురి!

ఇక టాలీవుడ్ పై గురి!

అందాల భామ అదితిరావు హైదరి..  హైదరాబాద్ కు చెందిన ముద్దు గుమ్మే  అన్న సంగతి అందరికీ తెలిసిందే అయినప్పటికీ, బాలీవుడ్ లో కెరీర్ ని   ప్రారంభించి మంచి పేరుని తెచ్చుకుంది. చెలియా, సమ్మోహనం, నవాబు చిత్రాలలో  కథానాయికగా నటించి మంచి ప్రాచుర్యాన్ని పొందింది.  

ఆ తర్వాత అంతరిక్షం లో మెరిసి అందరి హృదయాలను కొల్లగొట్టింది. వి చిత్రంలో హీరోయిన్ గా చక్కటి ప్రతిభను కనబరిచి  తనకంటూ ఓ స్థానాన్ని నిలుపుకుంది.  అయితే ఇప్పుడు తన చూపు టాలీవుడ్ పైనే గురి పెట్టిందట. దీనిలో భాగంగానే కొన్ని కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది.

తాజాగా దర్శకుడు విజయకుమార్ రూపొందించే ఓ కొత్త చిత్రంలో నటించడానికి సైన్ కూడా చేసిందట. ఈ చిత్రంలో  రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నట్టు సమాచారం. గుండె జారీ గల్లంతయ్యిందే చిత్రం తో దర్శకుడిగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ కుమార్ తను దర్శకత్వం వహించే కొత్త  చిత్రం కోసం అదితిని సంప్రదించారట,  అందుకు ఈ అమ్మడు  సై అనడంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉందట.

ఈ చిత్రం తో పాటు మరో మూడు చిత్రాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపించిందని టాలీవుడ్ అంతా అనుకుంటున్నారు అదీ విషయం!