రానా చేసిన పనికి..త్రిష ఫోన్ స్విఛ్చాఫ్

రానా, త్రిష ఎఫైర్ గురించి గతంలో చాలా వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిపై ఇద్దరిలో ఎవరూ కూడా నోరు విప్పలేదు. తాజాగా త్రిషతో తనకున్న అనుబంధం గురించి ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు రానా. ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో వెల్లడించని ఇంట్రస్టింగ్ విషయాలని పంచుకున్నాడు రానా.

అయితే ఆ కామెంట్సే ఇప్పుడు త్రిషను ఇరుకున పెట్టినట్లు సమాచారం. మీడియా వారు ఆమె స్పందన తీసుకుందామని ఫోన్స్ చేయటం మొదలెటారు. దాంతో ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో త్రిష ఫోన్ స్విఛ్ ఆఫ్ చేసిందని సమాచారం.

ఈ షోలో పాల్గొన్న రాజమౌళి, ప్రభాస్‌, రానాల ముందు కరణ్‌ పలు ఆసక్తికర ప్రశ్నలు ఉంచారు. మీరు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా అని కరణ్‌ రానాను ప్రశ్నించారు. దీనికి తాను సింగిల్‌ అని సమాధానమిచ్చారు. వెంటనే కరణ్‌ త్రిషతో రిలేషన్‌షిప్‌ గురించి ప్రస్తావించారు

దానిని తోసిపుచ్చిన రానా.. చాలా కాలంగా తామిద్దరం స్నేహితులుగా ఉన్నామని తెలిపారు. ఆమెతో దశాబ్ధ కాలంగా స్నేహం చేస్తున్నాను. చాలా కాలంగా స్నేహితులుగా కొనసాగాం.. కొంతకాలం డేటింగ్‌ కూడా చేశాం. కానీ పరిస్థితులు అనుకూలించలేద’ని తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం రావాలన్నది తన అభిప్రాయమన్నారు.