ఆమె ఎఫైర్ గొడ‌వ‌తో హీరో ప‌రువు బ‌జారుకి

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్.కే నాయుడు త‌న‌ని పెళ్లాడ‌తాన‌ని మోసం చేశాడ‌ని.. ఐదేళ్ల రిలేష‌న్ షిప్ లో అత‌డు న‌మ్మించి మోసం చేశాడ‌ని న‌టి సాయి సుధ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా సాయి సుధ మీడియా ముఖంగా త‌మ బాంధ‌వ్యానికి సంబంధించిన ఎన్నో విష‌యాల్ని బ‌హిరంగంగా వెల్ల‌డించారు. అయితే ఒక హీరో పేరును ఈ వ్య‌వ‌హారంలోకి తేవ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది.

సాయి సుధ అప్ప‌టికే పెళ్ల‌యిన శ్యామ్ కేతో రిలేష‌న్ షిప్ కొన‌సాగించాన‌ని బ‌హిరంగంగా చెప్ప‌డంపై ఒక సెక్ష‌న్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల కామెంట్లు వేడెక్కిస్తున్నాయి. ఇక‌పోతే భార్య‌తో స‌ర్ధుబాటు అయ్యాక త‌న‌ని దూరం పెట్టేస్తున్నాడంటూ ఆరోపించిన సాయి సుధ‌.. ఈ వివాదంలో యువ‌హీరో సందీప్ కిషన్ పేరును ప్ర‌త్యేకంగా హైలైట్ చేయ‌డంపై ఆ హీరోగారి ఫ్యాన్స్ సీరియ‌స్ గా ఉన్నార‌ట‌. ఆమె ఎఫైర్ గోల హీరోగారి ప‌రువును బ‌జారుకీడ్చింద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు శ్యామ్ కే సోద‌రుడు చోటా కే ప‌రువు మార్యాద‌ల‌కు ఇప్పుడు భంగం త‌ప్ప‌లేదు. ఎఫైర్లు గ‌డ‌బిడ అంటేనే ఇలా ఉంటుంద‌ని స‌ర్థి చెప్పుకోలేని ప‌రిస్థితి. ఇక సినీరంగంలో ఈ త‌ర‌హా ఎఫైర్లు ఎప్ప‌టికప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.