12 కోట్లా.. సాయి పల్లవిని చూపెట్టి మొత్తం సెట్ చేసారా?

శర్వానంద్‌, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్ 21న విడుదలకానుంది.. ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఒక బంపర్ డీల్ కుదుర్చుకుందని టాక్.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ చిత్రం శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. అలాగే డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ చిత్రం హిందీ డబ్బింగ్ కూడా మంచి రేట్ పలికింది. మొత్తం మీద పడి పడి లేచే మనసు 12 కోట్ల రూపాయల దాకా రాబట్టుకున్నట్టు సమాచారం. ఈ స్దాయి రేటు.. శర్వానంద్ కెరీర్ లోనే బెస్ట్ అని చెబుతున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ… రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది.

ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. తదుపరి షెడ్యూల్‌ను నేపాల్‌లో చిత్రీకరిస్తాం అని తెలిపారు. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కొరియోగ్రఫీ: రాజుసుందరం.