సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న మరో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ”దర్పణం’

రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా నటిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దర్పణం’. విడుదల అయిన టీజర్‌, ట్రైలర్‌ కి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచే సుకొని సెప్టెంబర్‌ 6న విడుదలకానుంది.

చిత్ర దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించాయి. అదే తరహాలో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం దర్పణం. చివరి వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని చూపిస్తూ ఆద్యంతం అలరిస్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరిని
అలరిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.