సుకుమార్ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా రష్మిక

కథానాయిక రష్మిక మందన్న అనతి కాలంలోనే తెలుగులో అగ్ర కధానాయకుల సరసన సినిమాలు చేస్తోంది. కెరీర్ మొదట్లోనే విజయాలు రావడమే ఇందుకు కీలకం. సరే, ప్రస్తుతం మహేష్ సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలో నటిస్తోంది. ఆ పైన అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటించనుంది.

ఈ చిత్రం వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో రష్మిక ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. అసలు ఇంత వరకు పట్టణంలో పిల్లగానే కనిపించిన ఈమె ఈ సారి పల్లెటూరి అమ్మాయిగా ఎలా మెప్పిస్తుంది వేచి చూడాలి. ఆ పైన సుకుమార్ ఈమెకు ఎలాంటి పాత్ర ఇచ్చాడో అను అనుకుంటున్నారు ఆమె అభిమానులు.