‘సాహో’ ప్రసాద్ మల్టిఫ్లెక్స్ లో పెరిగిన రేట్లు

‘సాహో’ ఇంత రేట్లు పెంచేసారేంటి బాస్

గత కొద్ది రోజులుగా సాహో తప్ప ఇంకే టాపిక్ మీడియాలో లేదు. సినిమా ఎలా ఉంటుంది ఎంత వసూలు చేస్తుంది అనే దాని గురించి తప్ప దేని గురించీ చర్చించుకోవడం లేదు. ఎందుకంటే బాహుబలి సీరిస్ తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. వాటిని అందుకునేందుకు ప్రభాస్ ..తన నిర్మాతలతో కలిసి ఓ రేంజిలో ప్రమోషన్ చేసారు. అయితే అదే సమయంలో తాము టిక్కెట్ రేట్లు సైతం పెంచేసారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జిబిటర్స్ కు ఎగస్ట్రా షోలు వేసుకోవటానికి, టిక్కెట్ రేటు పెంచుకోవటానికి ఫర్మిషన్ ఇచ్చేసింది. అయితే తెలంగాణా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అయితే ప్రసాద్ ఐమాక్స్ హైదరాబాద్ లో మాత్రం టెక్కెట్ రేట్లు బాగా పెంచేసినట్లు సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు..రూ.138 టిక్కెట్ ని రూ.200 కు పెంచారు. అలాగే రూ.230 టిక్కెట్ ని రూ.350 కు పెంచారు. రిలీజ్ రోజున 30 షోలు దాకా వేస్తున్నారు. అయితే ఈ పెంచిన టిక్కెట్లు రేట్లుని జనం భరించేలాగే కనపడుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుక్కింగ్ లలో ఓ రేంజి హంగామా జరిగింది.

ఇక ఇలా టికెట్ రేట్లు పెంచేయడం ఇప్పుడు ఫైనల్ ఫిగర్స్ నే ప్రభావితం చేస్తుందంటోంది ట్రేడ్ . ఈ టైమ్ లో టాక్ చాలా కీలక పాత్ర పోషించబోతోంది. వెండితెర అద్భుతం అన్నారా…ఎంత టిక్కెట్ అయినా ఓకే , లేకుంటేనే అసలు ప్లాబ్లం అంతా.