‘సాహో’ఫస్ట్ టాక్ ఎక్కడ నుంచి..ఎన్నింటికి ?

‘సాహో’టాక్ ఆ టైమ్ కు తేలిపోతుంది

‘బాహుబలి’వంటి ఘన విజయం సాధించిన తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’.నిర్మాతలు చెప్పేదాని ప్రకారం రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. శర్వానంద్ చేసిన ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీస్థాయిలో విడుదలవుతోంది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం టాక్ కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక, మిగతా సినీ లవర్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఫస్ట్ టాక్ ఎక్కడ నుంచి వస్తుంది, మొదట షో ఎక్కడ పడుతుంది..టాక్ ఏమి వస్తుందనేది అంతటా ఇంట్రస్టింగ్ విషయంగా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఫస్ట్ టాక్ దుబాయి నుంచి వస్తుంది. రాత్రి ఒంటిగంటకు సినిమా పూర్తవుతుంది. దాంతో ఫస్ట్ టాక్ సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. అప్పటిదాకా నిరీక్షణ తప్పదు.

సాహో ఓవర్‌సీస్‌ రైట్స్‌ని దుబాయ్‌కి చెందిన ఫార్స్‌ అనే సంస్థ 42 కోట్ల రూపాయలు పెట్టి తీసుకొంది. తమ కు అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లేకపోవటంతో ఈ సినిమాని యష్‌రాజ్‌ సంస్థ ద్వారా విడుదల చేస్తోంది. దుబాయ్‌కి చెందిన సంస్థే కొనటంతో దుబాయ్‌లో మొదట షో వేస్తున్నారు. అంటే ఇండియన్‌ టైమ్‌ ప్రకారం రేపు రాత్రి 10 గంటలకి దుబాయ్‌లో మొదటి షో పడుతుంది. అంటే దుబాయి నుంచి ఫస్ట్ టాక్ వచ్చేస్తుందన్నమాట.