“సాహో”:డ్యూయిల్ రోల్ ట్విస్ట్ పై ప్రభాస్ క్లారిటి

ప్రభాస్ నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

ఈ ట్రైలర్ విడుదల అయ్యాక….ఓ చిత్రం కథ గురించి టాక్ వచ్చింది. అదేమిటంటే…సాహోలో ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ ఇద్ద‌రూ పోలీస్ ఆఫీస‌ర్లుగానే క‌నిపించ‌నున్నార‌ట‌. వీరిలో ప్ర‌భాస్ రోల్ అండ‌ర్ క‌వ‌ర్ ఆఫ‌రేష‌న్ నేప‌థ్యంలో సాగుతుందంటున్నారు.

సాహో యాక్ష‌న్‌, విల‌న్లు, విజువ‌ల్స్ అన్ని ఒక ఎత్తు అయితే చివ‌ర్లో వ‌చ్చే ట్విస్ట్ అంద‌రికి దిమ్మ‌తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందంటున్నారు. ఆ ట్విస్ట్ ఏంటో కాదు ప్రభాస్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌డ‌మే అని. ఇది క్లైమాక్స్‌లో వ‌స్తుంద‌ని అన్నారు.

అయితే ఈ విషయమై ప్రభాస్ మాట్లాడారు. ‘సాహో’లో నాది డ్యూయెల్‌ రోల్‌ కాకపోవచ్చు. అలాంటి క్యూరియాసిటీ ఉండాలనే ట్రైలర్‌ను అలా కట్‌ చేశాం అని చెప్పుకొచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురువారం అర్ధ‌రాత్రి నుంచే సాహో సంద‌డి మొద‌లు కానుంది. ఏపీలో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ల‌కు అనుమ‌తులు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో వీటికి అనుమ‌తులు రావాల్సి ఉందంటున్నారు. సాహోలో ప్ర‌భాస్ నిజంగా డ్యూయ‌ల్ రోల్ చేస్తే అది రెండోసారి అవుతుంది… ప్రభాస్ గతంలో బిల్లా సినిమాలో డబల్ రోల్ లో కనిపించారు .