సాయి ప‌ల్ల‌వి ని‌జంగా హైబ్రీడ్ పిల్లే!

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల `ఫిదా` సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసింది త‌మిళ చిన్న‌ది సాయి ప‌ల్ల‌వి. మ‌ల‌యాళ చిత్రం `ప్రేమ‌మ్‌`లో మ‌ల‌ర్‌గా మ‌ర్చిపోలేని పాత్ర‌లో మెప్పించింది. భానుమ‌తి ఒక్క‌టే పీస్ మైబ్రీడ్ పిల్లా రెండు మ‌తాలు.. రెండు కులాలు అంటూ తొలి సినిమాతోనే త‌న మార్కు ఏంటో చూపించి రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ తను హైబ్రీడ్ పిల్ల అనిపించుకుంది.

స‌క్సెస్ రేటు త‌క్కువే అయినా త‌ను చేసిన చిత్రాల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర‌ని వేసింది. ఆ పాత్ర‌ల్లో త‌ను మాత్ర‌మే న‌టించాల‌నేంత‌గా పేరు తెచ్చుకుంది. సాయి ప‌ల్ల‌వికి ఇండ‌స్ట్రీలో ఎంత మంచి పేరుందో పుకార్ల కార‌ణంగా అంత చెడ్డ పేరు కూడా ఏర్ప‌డింది. త‌న‌కు కావాల్సిన వాటి విష‌యంలో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం రానాతో `విరాట‌ప‌ర్వం`, నాగ‌చైత‌న్య‌తో `ల‌వ్‌స్టోరీ` చిత్రాల్లో న‌టిస్తోంది. ప‌క్క‌న ఎంత స్టార్ హీరో వున్నా వాళ్ల‌ని డామినేట్ చేయ‌గ‌ల అభిన‌యం సాయి ప‌ల్ల‌వి సొంతం. అదే ధైర్యంతో తాజాగా త‌న పారితోషికాన్ని కోటి 40క్ష‌ల‌కు పెంచేసి నిర్మాత‌ల‌కు షాకిచ్చిందని తెలిసింది. ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల త‌రువాత ఈ రెమ్యున‌రేష‌న్ ఇస్తేనే ఏ నిర్మాత‌కైనా డేట్స్ ఇస్తుంద‌ట‌. అఏదంటే లేద‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇలాంటి నిర్ణ‌యం సాయి ప‌ల్ల‌వికే న‌ష్టాన్ని క‌లిగిస్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే ఆమె యాటిట్యూడ్ గురించి తెలిసిన వాళ్లు మాత్రం సాయి ప‌ల్ల‌వి ఈ విష‌యంలో నిజంగా హైబ్రీడ్ పిల్లే అంటున్నారు.