సాయి ధరమ్ తేజ్ సరసన ఇస్మార్ట్ అమ్మాయి

‘ఇస్మార్ట్ శంకర్’ తో తిరిగి ఆదరణ తెచ్చుకున్నాడు పూరి జగన్నాధ్. ఇక ఆ సినిమాలోని హీరో రామ్ మరియు హీరోయిన్ నాభ నటేష్ కు కూడా అవకాశాలు బానే వస్తున్నాయి. సినిమాలో తెలంగాణ యాస దంచేసిన ఈ అమ్మాయిని ప్రజలు బాగానే గుర్తు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈమెకు సాయి ధరమ్ తేజ్ సరసన కథా నాయికగా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో సుబ్బు అనే దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. నిర్మాత బీవిఎస్ఎం ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘ప్రతీ రోజు పండగే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.