శేఖర్ కమ్ముల-నాగ చైతన్య ల చిత్రం ఈ ఏడాది రావట్లేదా?

‘ఫిదా’ తో మళ్ళి హిట్ అందుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆ సినిమా పెద్ద విజయం సాధించినా కొంచెం సమయం తీసుకుని కథ రాసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆ చిత్రానికి కూడా నాగ చైతన్య, సాయి పల్లవి లు అయితేనే బాగుంటుందని సినిమా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ చిత్రం ముందుగా అనుకున్నట్టు డిసెంబర్లో రావట్లేదు. ఈ చిత్రం విడుదలకు మరి కొంత సమయం పడుతుందట. దాంతో ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావచ్చు అని సమాచారం. ఈ చిత్రంతో పంపిణీ సంస్థ ఆసియన్ సినిమాస్ నిర్మాణ రంగంలో అడుగు పెడుతోంది.