శృతి ఇచ్చిన షాక్‌తో మ‌ళ్లీ ఆమె కోసం పాట్లు?

శృతి ఇచ్చిన షాక్‌తో మ‌ళ్లీ ఆమె కోసం పాట్లు?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు కీల‌క స‌న్నివేశాల‌తో మేజ‌ర్ పార్ట్ పూర్తి చేసుకుంది. శ్రీ‌రామ్ వేణు తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి ముందు ప్ర‌కాష్‌రాజ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన‌గా కోర్టు డ్రామాకు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల్ని పూర్తి చేశారు.

సినిమా ప్రారంభిం నుంచి ఓ స‌మ‌స్య వెంటాడుతోంది. త‌మిళ వెర్ష‌న్‌లో అజిత్ న‌టించారు. అందులో అజిత్‌కు జోడీగా విద్యాబాల‌న్ క‌నిపించింది. అదీ కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మాత్ర‌మే. అదే త‌ర‌హాలో తెలుగు వెర్ష‌న్ కోసం కూడా ఫ్లాష్ ‌బ్యాక్ ఎపిసోడ్ ని ప‌వ‌న్ కోసం కొంచెం భిన్నంగా డిజైన్ చేశార‌ట‌. అయితే
ఈ ఎపిసోడ్‌లో న‌టించే హీరోయిన్ ఎవ‌రా అని గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంది. శృతిహాస‌న్ న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంపై శృతి హాస‌న్ స్పందించి త‌ను న‌టించ‌డంలేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో మేక‌ర్స్ ఇలియానాని సంప్ర‌దించార‌ట‌.

ఇల్లీ బేబీనే ముందు సంప్ర‌దిస్తే‌ పారితోషికం ఎక్కువ చెప్ప‌డంతో ఆమెని ప‌క్క‌న పెట్టిన దిల్ రాజు ఆ త‌రువాత శృతిని సంప్ర‌దించార‌ట‌. తాజాగా శృతి నో చెప్ప‌డంతో మ‌ళ్లీ ఇలియానాను సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. మ‌రి ఇలియానా ఓకే అంటుందా? .. దిల్ రాజు కండీష‌న్‌కి ఓకే చెబుతుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.