వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని, మ‌రి కొంత మందికి దారుణ‌మైన ఫ్లాప్‌ల‌ని అందించాయి. తాజాగా అలాంటి ఓ క‌థే మాస్ మ‌హ‌రాజాని వెతుక్కుంటూ వ‌చ్చింది. `హ‌లో గురూ ప్రేమ కోస‌మే` చిత్రం త‌రువాత త్రినాథ‌రావు న‌క్కిన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ని న‌మ్ముకున్నాడు. కానీ అక్క‌డ సురేష్ బాబు ఎటూ తేల్చ‌క నాన్చుతుండ‌టంతో త్రినాథ‌రావు బ‌య‌ట ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడ‌ట‌.

వెంకీ హీరోగా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్టోరీని చేయాల‌ని త్రినాథ‌రావు న‌క్కిన ప్లాన్ చేసుకున్నాడు. క‌థ విన్న వెంకీ ఓకే అంటే సురేష్ బాబు మాత్రం మార్పుల మీద మార్పులు చెబుతూనే వున్నాడ‌ట‌. దీంతో విసుగొచ్చిన త్రినాథ‌రావు న‌క్కిన అదే క‌థ‌ని మాస్ రాజా ర‌వితేజ‌కు వినిపించాడ‌ట‌. క్యారెక్ట‌ర్ కొత్త‌గా వుండ‌టం, పోలీస్ క్యారెక్ట‌ర్ కావ‌డంతో ర‌వితేజ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించ‌బోతోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం వుందని తెలిసింది.