విశాల్‌ని ప్ర‌శాంతంగా వుండ‌నివ్వ‌డ‌ట‌!

హీరో విశాల్‌, ద‌ర్శ‌కుడు మిస్కిన్ మధ్య అభిప్రాయ భేధాలు త‌లెత్తిన విష‌యం తెలిసింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `తుప్పారివాల‌న్‌`. తెలుగులో `డిటెక్టివ్‌` పేరుతో విడుద‌లైంది. రెండు భాష‌ల్లోనూ మంచి విజ‌యాన్ని సాధించింది. ఇదే చిత్రానికి సీక్వెల్‌ని `తుప్పారివాల‌న్‌ 2` పేరుతో చేయాల‌ని ప్లాన్ చేశారు. విశాల్ హీరో క‌మ్ ప్రొడ్యూస‌ర్‌. అంతా బాగానే సెట్ట‌యింది. లండ‌న్‌కు టీమ్ వెళ్లింది. అక్క‌డే కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేశారు.

ఆక్క‌డే అస‌లు ట్విస్ట్ మొద‌లైంది. మిస్కిన్ రోజుకి ఒక్క సీన్ కూడా పూర్తిగా తీయ‌డం లేద‌ట‌. దీంతో విశాల్‌కు 13 కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌ట‌. ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ మిస్కిన్‌ని త‌న సినిమా నుంచి త‌ప్పిస్తున్నాన‌ని, ద‌ర్శ‌కత్వ బాధ్య‌త‌ల్ని తానే నిర్వ‌ర్తిస్తున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా విశాల్ మిస్కిన్‌ని ఏకిపారేశాడు. రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన మిస్కిన్ రివ‌ర్స్‌లో విశాల్‌కు కౌంట‌ర్ ఇవ్వ‌డం మొద‌లుపెట్టాడు.

త‌న‌ని, త‌న త‌మ్ముడిని విశాల్ అవ‌మానించాడ‌ని, బ‌డ్జెట్ పెరిగింద‌ని త‌న రెయ్యున‌రేష‌న్ ఇవ్వ‌న‌న్నాడ‌ని. చివ‌రికి త‌న త‌ల్లిని కూడా బూతులు తిట్టాడ‌ని. ఇకపై విశాల్‌ని ప్ర‌శాంతంగా నిద్ర‌పోనివ్వ‌న‌ని హెచ్చ‌రించాడు. దీంతో త‌మిళ నాట మ‌ళ్లీ వాతావ‌ర‌ణం వేడెక్కింది.