వంశీ పైడిప‌ల్లికి హీరో దొరికిన‌ట్టేనా?

ఇండస్ట్రీలో హిట్ ఒక్క‌టే కొల‌మానం.. కానీ అది కూడా స‌రిపోద‌ని వంశీ పైడిప‌ల్లి ఉదంతంతో స్ప‌ష్ట‌మైంది. `మ‌హ‌ర్షి`తో మ‌హేష్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించాడు వంశీ. ఆ త‌రువాత స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని చేసిన మ‌హేష్ ఈ సినిమా త‌రువాత నెక్ట్స్ చేయ‌బోయే సినిమా వంశీ పైడిప‌ల్లితోనే వుంటుంద‌ని మీడియా ముఖంగా చెప్పాడు మ‌హేష్‌.

లై‌న్ మాత్ర‌మే విని సినిమాకు క‌మిట్ అయిన మ‌హేష్ ఆ త‌రువాత చెప్పిన క‌థ అనుకున్నంత‌గా లేక‌పోవ‌డంతో వంశీ పైడిప‌ల్లిని ప‌క్క‌న పెట్టేసి ఆ స్థానంలో ప‌ర‌శురామ్‌ని తెర‌పైకి తీసుకొచ్చాడు. క‌థ ఓకే నెక్ట్స్ ఫిల్మ్ ప‌ర‌శురామ్‌తోనే అనే లీకులిచ్చాడు మ‌హేష్‌. దీనికి తోడు రాజ‌మౌళి త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్‌తో చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డంతో వంశీకి అక్క‌డ అవ‌కాశం లేకుండా పోయింది.

దీంతో కాంపౌండ్ మార్చిన వంశీ పైడి ప‌ల్లి మెగా కాంపౌండ్‌లో ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లుపెట్టాడు. ప‌వ‌ర్‌స్టార్ రామ్‌‌చ‌ర‌ణ్ చుట్టూ తిర‌గ‌డం స్టార్ట్ చేశాడు. ఈ ఇద్ద‌రి క‌లయిక‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఫిల్మ్ `ఎవ‌డు` రూపొందిన విష‌యం తెలిసిందే. త‌న‌కు హిట్ సినిమా ఇచ్చిన వంశీకి సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న రామ్‌చ‌ర‌ణ్ కండీష‌న్స్ పెట్టాడ‌ట‌. `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత సినిమా అంటే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌కి ఏమాత్రం త‌గ్గ‌కూడ‌దు. ఆ విష‌యాన్ని గుర్తుపెట్టుకుని క‌థ‌లో ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా ప‌క్కాగా సిద్ధం చేసుకుని ర‌మ్మ‌న్నాడ‌ట‌. చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో వంశీ పైడిప‌ల్లి ప్ర‌స్తుతం మార్పులు చేర్పులు చేస్తున్నాడ‌ని తెలిసింది.