రెండు రోజుల్లో ప‌ది కోట్లు దాటేసింది!

నితిన్ న‌టించిన `భీష్మ‌` వ‌సూళ్ల ప‌రంగా జోరు పెంచేసింది. తొలి రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో మంచి వ‌సూళ్లు సాధించింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి 6.3 కోట్ల షేర్‌ని రాబ‌ట్టిన ఈ చిత్రం రెండ‌వ రోజు కూడా అదే జోరును కొన‌సాగించింది. మౌత్ టాక్ స్ప్రెడ్ కావ‌డంతో రెండ‌వ రోజు కూడా ట్రేడ్ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ 4.23 కోట్ల షేర్‌ని సాధించింది. రెండు రోజుల‌కు గాను 10.52 కోట్లు వ‌సూలు చేసింది. వీకెండ్ ఈ ఫిగ‌ర్ మ‌రింత పెరిగే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సాధించిన‌ రెండు రోజుల క‌లెక్షన్స్ వివ‌రాలివి.

నైజాం: 4.11 కోట్లు

సీడెడ్ : 1.44 కోట్లు

గుంటూరు : 1.03

ఈస్ట్ గోదావ‌రి : 0.92

కృష్ణా : 0.71

వెస్ట్ : 0.71

నెల్లూర్ : 0.37

ఏపీ, తెలంగాణ మొత్తం వ‌సూళ్లు : 10. 52 కోట్లు

యూఎస్‌లో `భీష్మ‌` రెండు రోజుల‌కే దాదాపు హాఫ్ మిలియ‌న్ సాధించిన‌ట్టు తెలిసింది.