రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి…యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి మృతితో రాజీవ్ క‌న‌కాల కుటుంబం క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది. అలాగే శ్రీక్ష్మి మృతి ప‌ట్ల కొంద‌రు ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తులు దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేసారు. ఆమె భ‌ర్త ర‌చ‌యిత పెద్ది రామారావు కాగా, ఆమె తండ్రి ప్ర‌ముఖ న‌టుడు దేవ‌దాస్ క‌న‌కాల ఏకైక కుమార్తె.

శ్రీల‌క్ష్మి కి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు క‌ల‌రు. ఆమె ప‌లు టీవీ సీరియ‌ల్స్ లో న‌టించారు. అలా బుల్లి తెర‌తో అనుబంధం ఏర్ప‌డింది. ఆమె స‌మ‌కాలీకులు శ్రీల‌క్ష్మి మృతిప‌ట్ల క‌న్నీరు ప‌ర్యంతం అయ్యారు. రాజీవ్ క‌న‌కాల త‌ల్లిదండ్రులు గ‌తంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. తాజా ఘ‌ట‌న‌తో రాజీవ్ కుటుంబంలో మ‌రింత విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి. శ్రీల‌క్ష్మి అంత్య క్రియ‌ల‌కు సంబంధించిన ఇత‌ర విష‌యాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో బంధువులు… ఇత‌ర కుటుంబ స‌భ్యులు త‌క్కువ‌గా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప బ‌య‌ట‌కు రాని స‌న్నివేశం నేప‌థ్యంలో కార్య‌క్ర‌మాలు ఎలా ముగిస్తారు? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.