రాఖీభాయ్ కోసం ర‌మికాసేన్ వ‌చ్చేసింది!

క‌న్న‌డ సినీ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. సైలెంట్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మోన్‌స్ట‌ర్‌గా బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేసింది. దేశ వ్యాప్తంగా తిరుగులేని విజ‌యాన్ని సాధించి `బాహుబ‌లి` త‌రువాత మ‌రోసారి భాయ‌తీయ సినీ దిగ్గ‌జాలు ద‌క్షిణాది సినిమా వైపు ఆశ్చ‌ర్యంతో చూసేల చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా చాప్ట‌ర్ 2 రూపొందుతోంది. తొలి భాగం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో ప్ర‌స్తుతం అంద‌రి చూసు రెండ‌వ భాగంపై ప‌డింది.

య‌ష్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజ‌య్‌ద‌త్ విల‌న్‌గా అధీరా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, మైసూర్‌ల‌లో ప‌లు కీల‌క షెడ్యూళ్ల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పూర్తి చేశారు. కీల‌క ఘ‌ట్టాల కోసం చిత్ర బృందం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి చేరింది. ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల్ని షూట్ చేయ‌బోతున్నారు. తొలి భాగానికి సంబంధించిన ట్రైల‌ర్‌లో న‌రాచీని ఆక్ర‌మించి స్వంత ప్ర‌భుత్వాన్ని అమ‌లు చేస్తున్న గ్యాంగ్‌స్ట‌ర్ రాఖీని అంతం చేయ‌మ‌ని అప్ప‌టి ప్ర‌ధాని ర‌మికా సేన్ సేన‌ల‌కు డెత్ వారెంట్ ఇష్యూ చేస్తుంది.

ఆ పాత్ర‌లో బాలీవుడ్ భామ ర‌వీనా టాండ‌న్ క‌నిపించ‌బోతోంది. తాజాగా ఆదావారం ఆమె షూటింగ్‌లో పాలల్గొందంటూ ద‌ర్శ‌కుడు ఓ ఫొటోని సోస‌ల్ మీడీయా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల కోసం షేర్ చేశారు. రాఖీ భాయ్‌కి డెత్ వారెంట్ ఇష్యూ చేసిన లేడీ వ‌చ్చేసింది. సెట్‌లోరి అమెకి వార్మ్ వెల్క‌మ్` అని ప్ర‌శాంత్ నీల్ ట్వీట్ చేశారు. అన్నీ అనుకూలంగా అనుకున్న‌ట్టు కుదిరితే జూలై 20న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ రిలీజ్ మాత్రం ప‌క్కాగా ఆగ‌స్టులోనే వుండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

https://twitter.com/prashanth_neel/status/1226382258510028802