మ‌హేష్‌నే ఫైన‌ల్ చేశారు..టైటిల్ మారే ఛాన్స్‌?

మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్నారు. కొర‌టాల శివ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. కొరటాల స్నేహితుడు నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి హీరో రామ్‌చ‌రణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇటీవ‌ల లీక్ అయిన చిరు ఫొటోల‌ని బట్టి చిరు ఎరుపు రంగు ష‌ర్ట్, ఆలీవ్ గ్రీన్ పాంట్‌లో క‌నిపించిన చిరు ప్ర‌జానాట్య‌మండలి కార్య‌క‌ర్త‌గా కూడా క‌నిపిస్తార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు చిరంజీవి త‌న‌కు తెలియ‌కుండానే `ఓ పిట్ట‌క‌థ‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ‌య‌ట‌పెట్టేసి ఆ త‌రువాత జ‌రిగిన పొర‌పాటుని గుర్తించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. దీంతో షాక్‌కు గురైన చిరు జ‌ర‌గాల్సిన త‌ప్పిదం జ‌రిగిపోయింద‌ని నాలుక క‌రుచుకున్నంత ప‌ని చేశారు. తాజాగా చిరు చేసిన పొర‌పాటుకి కొర‌టాల దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లుపెట్టార‌ట‌. ఈ చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర‌లో మ‌హేష్‌నే ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. 30 నిమిషాల‌కు మించి క్యారెక్ట‌ర్ వుండ‌టంతో `ఆచార్య‌` టైటిల్‌ని ప‌క్క‌న పెట్టి మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ని పెట్టాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్లాన్ చేస్తున్నార‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఆ టైటిల్ ఎలా వుండ‌బోతోంది?. మ‌హేష్ లుక్ ఎలా వుంటుంది? అన్న విష‌యాలు తెలియాలంటే ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ వ‌రకు వేచిచూడ‌క త‌ప్ప‌దు. ఇందులో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ వారంలోనే త్రిష ఎంట‌ర్ కాబోతోంది.