మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ట‌. ఇదిలా వుంటే చిరు న‌టిస్తున్న చిత్రానికి కూడా మ‌హేష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వరుస క‌థ‌నాలు వినిపిస్తున్న వేళ తాజాగా మ‌రో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్త‌లు ప్ర‌తీసారి వినిపిస్తూనే వున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ బ‌డా నిర్మాత సాజిద్ న‌దియావాలా త‌ను నిర్మించిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి సీక్వెల్‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీలో ర‌ణ్‌వీర్‌సింగ్ కూడా న‌టించ‌నున్నాడ‌ట. ఇందులో మ‌హేష్‌ని కూడా న‌టింప‌జేయాల‌ని, ఇందు కోసం ఓ భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేశాడ‌ని తెలిసింది. అయితే ఈ ఆఫ‌ర్‌ని మ‌హేష్ అంగీక‌రిస్తాడా?.. బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని ఇంత కాలం చెబుతూ వ‌చ్చిన మ‌హేష్ సాజిద్ న‌దియావాలా ఇచ్చిన ఆఫ‌ర్‌ని ఓకే చేస్తాడా? ఇంత బిజీ షెడ్యూల్‌లో అది అయ్యే ప‌నేనా? అని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.