మేజర్ కోసం కసరత్తులు మొదలు పెట్టిన శేష్

హీరో అడివి శేష్ కు కాలం కలిసి వస్తున్నది. ‘గూఢచారి’ తరువాత ‘ఎవరు’ కూడా మంచి హిట్ అయింది. ఈ నెల్లో ఇంత వరకు విడుదల అయిన సినిమాల్లో ఇతని సినిమానే హిట్ అయింది. అందువల్ల ఇప్పుడు శేష్ సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు చేస్తాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. అందుకేనేమో సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా తన బ్యానర్లో అడివి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఇది మహేష్ బాబు పూర్తి నిర్మాతగా మారి మరో హీరోతో చేస్తున్న సినిమా.

ఈ సినిమా 2008 ముంబై దాడుల్లో చనిపోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ. మేజర్ పాత్రను పోషించాలంటే మంచి శారీరక దృఢత్వం అవసరం అందువల్ల అప్పుడే శేష్ కసరత్తులు మొదలు పెట్టేసాడు. సుమారుగా 10 కిలోలు తగ్గాల్సి ఉంది శేష్. నిరంతరం ప్రేక్షకులను కొత్తదనం రుచి చూపించే శేష్ ఈ సారి ఎలాంటి సినిమా చూపిస్తాడో వేచి చూద్దాం.