మెగా హీరో కోసం రంగంలోకి దిల్‌రాజు – యువీ!

`చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇటీవ‌ల `ప్ర‌తీరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు అందించిన స‌క్సెస్ ఆనందంలో వున్న సాయిధ‌ర‌మ్‌తేజ్ రెట్టించిన ఉత్సాహంతో `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` మూవీ చేస్తున్నాడు. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆయ‌న కుమారుడు భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మిస్తున్న‌రు.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తోంది. టీజ‌ర్ టాక్ పాజిటీవ్‌గా రావ‌డం, సినిమా మేకింగ్‌, టేకింగ్‌తో పాటు సాయిధ‌ర‌మ్‌తేజ్ క్యారెక్ట‌ర్ కూడా కొత్త‌గా వుండ‌టంతో ఈ సినిమా కోసం డిస్ట్రి బ్యూట‌ర్‌ల మ‌ధ్య పోటీ అప్పుడే మొద‌లైంది. `ప్ర‌తీరోజు పండ‌గే` లాభాల్ని అందించ‌డంతో ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ అంత‌టా రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్ణ‌యించుకున్నాయ‌ట‌. ఇందు కోసం భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేసి డిస్ట్రీబ్యూష‌న్ రైట్స్‌ని సొంతం చేసుకున్నారు.

న‌భా న‌టేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌రా సినీ చిత్ర బ్యాన‌ర్‌పై భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌, భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ హీరోయిన్ న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మే 1న రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతున్న ఈ చిత్రం సాయిధ‌ర‌మ్‌తేజ్ స‌క్సెస్ ప‌రంప‌రని కొన‌సాగిస్తుందో లేదో చూడాలి.