మెగాస్టార్ సినిమాలో రౌడీస్టార్!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 153వ సినిమాగా మ‌ల‌యాళ సినిమా లూసీఫ‌ర్ ని రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ కు ఈ రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ రీమేక్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు స్ర్కిప్ట్ లో భారీగానే మార్పులు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈనేప‌థ్యంలో కొంద‌రు సీనియ‌ర్ రైట‌ర్ల సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా తీసుకుంటున్నాడు. మెగాస్టార్ ఆదేశాల మేర‌కే సుజీత్ న‌డుచుకుంటున్నాడు. ఇందులో ఓ యంగ్ హీరో న‌టించాల్సిన కీల‌క‌మైన పాత్ర కూడా ఉంది. మాతృక‌లో పృథ్వీరాజ్ ఆ పాత్ర పోషించాడు. ఈ నేప‌థ్యంలో ఆ పాత్ర‌ను తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగింది.

కానీ ఎందుక‌నో అది సాధ్య‌క‌క‌పోవ‌డంతో తాజాగా రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు తెరపైకి వ‌చ్చింది. ఈ ప్ర‌పోజ‌ల్ ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాల నుంచి తెలిసింది. యంగ్ హీరో కూడా సానుకూలంగానే ఉన్నాడ‌ని టాక్. అందులో పెద్ద రోల్ కాదు కాబ‌ట్టి ఎక్కువ‌గా కాల్షీట్లు కేటాయించాల్సిన ప‌నిలేదు. ఈ నేప‌థ్యంలో చిరంజీవిపై అభిమానంతో చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక రౌడీ స్టార్ కి ఇండ‌స్ర్టీలో మెగా ఫ్యామిలీ అండ‌దండ‌లు ఉండ‌నే ఉన్నాయి. ట్యాక్సీవాలా సినిమా స‌మ‌యంలో రౌడీ స్టార్ పై నెగిటివ్ ప్ర‌చారం జ‌ర‌గడంపై, ఆ సినిమా ని రిలీజ్ కు ముందే ఇంట‌ర్నెట్ లో లీక్ చేయ‌డంపై మెగా నిర్మాత అల్లు అర‌వింద్ నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే.

విజ‌య్ ని బ్యాడ్ చేయాల‌ని చూస్తే ఎవ‌రి తాటైనా తీస్తాన‌ని హెచ్చ‌రించారు. విజ‌య్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే ముందు త‌న‌ని దాటాలని అరవింద్ సీరియ‌స్ అయ్యారు . ఆ త‌ర్వాత విజ‌య్ ని టార్గెట్ చేసిన బ్యాచ్ వెన‌క్కి త‌గ్గింది. అలా మెగా ఫ్యామిలీతో విజ‌య్ కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఏర్ప‌డింది. నాటి నుంచి అర‌వింద్ విధేయుడిగా విజ‌య్ న‌డుచుకుంటున్నాడు. అయితే అంత‌కు ముందే విజ‌య్ గీత‌గోవిందం సినిమాతో హీరోగా తన ఇమేజ్ ను రెట్టింపు చేసుకున్నాడు.