మహేష్ – ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ వెనుక ఇంత‌స్టోరీ వుందా?

`స‌రిలేరు నీకెవ్వరు` హిట్ త‌రువాత కొంత స‌మ‌యం ఫ్యామిలీతో గ‌డిపిన మ‌హేష్ ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ స్థానంలో కొర‌టాల శివ వ‌ల్ల ప‌ర‌శురామ్ వ‌చ్చి చేశాడు. మొత్తానికి లైన్ ఓకే అయిచింది. ఫైన‌ల్ స్క్రిప్ట్ ని లాక్ చేశారు కూడా.

అయితే అస‌లు గొడ‌వ ఇక్క‌డే మొద‌లైంది. మ‌హేష్‌తో సినిమా చేయాల‌న్న‌ది ప‌ర‌శురామ్ డ్రీమ్‌. అది కొర‌టాల శివ వ‌ల్ల కార్య‌రూపం దాల్చ‌బోతోంద‌న్న సంబ‌రంలోవున్న ప‌ర‌శురామ్‌కు 14 రీల్స్ ప్ల‌స్ గుదిబండ‌గా మారింది. మ‌హేష్‌తో సినిమా చేయాలంటే 14 రీల్స్ ప్ల‌స్ ప‌ర్మీష‌న్ త‌ప్ప‌ని స‌రి. కార‌ణం 14 రీల్స్ ప్ల‌స్ లో అడ్వాన్స్ తీసుకున్న ప‌ర‌శురామ్ అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో సినిమాకు క‌మిట్ అయ్యాడు. అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది.

ఇదే టైమ్‌లో ప‌ర‌శురామ్ క‌ల‌ని నిజం చేయ‌డానికి కొర‌టాల శివ ప్లాన్ చేసి మ‌రీ మ‌హేష్ ద‌గ్గ‌రికి పంపించాడు. వెంట‌నే లైన్ వినిపిస్తే మ‌హేష్ సింగిల్ సిట్టింగ్‌లోనే ప‌ర‌శురామ్‌కు ఓకే చెప్పేశాడు. నీ సినిమానే నెక్స్ట్ చేద్దాం అని క‌మిట్ మెంట్ కూడా ఇచ్చేశాడు. మైత్రీ మూవీమేక‌ర్స్ కూడా రెడీ. ఫైన‌ల్‌ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్త‌యితే అప్పుడు సెట్స్‌పైకి వెళ్ల‌డానికి మ‌హేష్‌తో పాటు నిర్మాత‌లు రెడీ. ఇలా అన్నీ రెడీ కావ‌డంతో ప‌ర‌శురామ్ కూడా రెడీ అయ్యాడు.

అయితే త‌మ సినిమాని ప‌క్క‌న పెట్టి మ‌హేష్ సినిమా ఎలా చేస్తావ‌ని 14 రీల్స్ ప్ల‌స్ అభ్యంత‌రం తెలిపాయి. దీంతో అడ్వాన్స్ తిరిగి ఇస్తాను కానీ మ‌హేష్ సినిమాని మాత్రం వ‌దులుకోన‌ని ప‌ర‌శురామ్ చెప్పేశాడ‌ట‌. ఈ స్టోరీ మ‌హేష్ దాకా వెల్ల‌డంతో తానే స్వ‌యంగా ఈ వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌దిద్ది 14 రీల్స్ ప్ల‌స్ నిర్మాత‌ల్ని కూడా త‌ను, ప‌రుశురామ్ క‌లిసి చేయ‌ను్న చిత్రానికి భాగ‌స్వాముల‌ని చేశాడ‌ట‌. దీంతో ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల క‌థ‌నం.