మరో మల్టీస్టారర్ మూవీకి సై అనేసిన దిల్ రాజు

దశాబ్దాల తర్వాత మళ్లీ మల్టీస్టారర్ మూవీలకి ప్రాణం పోసింది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ. టాలీవుడ్ టాప్ హీరోస్ విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల… నిర్మాణ బాధ్యతలు వహించారు దిల్ రాజు. భారీ హిట్ అందుకుని మూవీకి పని చేసిన టెక్నీషియన్స్ కి మంచి పేరుతో పాటు నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఆ మూవీ స్ఫూర్తిగా చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో యాక్ట్ చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్ తో ఎఫ్2 చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు మరో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నారు ఈ బడా ప్రొడ్యూసర్. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ‘అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్ మెన్, సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాలను అందించారు ఈ దర్శకుడు. అయితే ఇప్పుడు తీయబోతున్న చిత్రం యాక్షన్ థ్రిల్లర్ తరహాలో ఉండనుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది ఈ చిత్ర బృందం.