మరో ఇద్దరితో కలిసి మోహన్ బాబు బ్యాంక్ దోపిడి

సైరా ఊపులో మోహన్ బాబు బ్యాంక్ దోపిడి

సైరా ఉత్సాహం మోహన్ బాబులో కూడా కనపడుతోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడో సినిమా చేయబోతున్నట్లు టాక్. వరస పెట్టి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్న ఆయన మొదట ఓ క్రైమ్ కామెడీ సినిమాలో కనపడబోతున్నట్లు చెప్తున్నారు. ఆయన తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ బ్యాంక్ దొంగతనం చేస్తారట. ‘Going In Style’ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందబోతున్నట్లు చెప్తున్నారు.

‘Going In Style’సినమాలో ముగ్గురు సీనియర్స్ …పెన్షన్స్ మీద బ్రతుకుతూంటారు. అయితే బ్యాంక్ వారి పెన్షన్ ఎక్కౌంట్స్ ని ఏదో సాకు చూపించి క్లోజ్ చేయటంతో …వేరే దారిలేక అదే బ్యాంక్ ని దోపిడీ చేస్తారు. ఆ క్రమంలో వచ్చే ఫన్, పరిణామాలే ఈ సినిమాకు మూలం. ఈ స్టోరీ లైన్ ని తెలుగుకు ఎలా ఎడాప్ట్ చేస్తారో చూడాలి.ఇక ఈ సినిమాకు నిర్మాతలు ఆయన పిల్లలేట. డైరక్టర్ ఎవరనేది తెలియాల్సి ఉంది.

ఈ విషయం ప్రక్కన పెడితే సైరా హిట్టైన నేపథ్యంలో నటుడు మోహన్ బాబు తాజాగా ఓ ట్వీట్ చేశారు. నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్‌కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార, తమన్నా, అనుష్క నటించారు.