మరోసారి సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్

హీరో గోపీచంద్ ప్రస్తుతం ‘చాణక్య’ అనే యాక్షన్ సినిమా చేసి దాని విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ లోగా తన తదుపరి చిత్రాలకు సంతకం చేస్తున్నారు. తాజాగా ఒక తమిళ దర్శకుడితో సినిమా ప్రారంభించాడు.

అటు పైన తానూ అదివరకు చేసిన ‘గౌతమ్ నందా’ దర్శకుడు సంపత్ నంది తో మరో సినిమాకి సంతకం చేసాడు. ఈ సినిమాను ‘యు టర్న్’ చిత్ర నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఆయన సొంత బ్యానర్లో నిర్మించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ప్రస్తుతం తానూ నటించిన ‘చాణక్య’ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నాడు. కెరీర్ పరంగా ఈ సినిమా విజయం గోపీచంద్ కు చాలా కీలకం. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ పిరజాడ హీరోయిన్ గా నటించింది.