మరోసారి మహేష్ సరసన తమన్నా

Tamannah Bhatia

మిల్కీ బ్యూటీ తమన్నా పని అయిపొయింది అనుకుంటుండగా ‘F2 ‘ హిట్ తో మన ముందుకు వచ్చింది. ఆ పైన ‘సై రా’ సినిమాలో కూడా ఆమె ఒక పాత్ర పోషించింది. ఇక ఇప్పటికే హీరో గోపీచంద్ సరసన హీరోయిన్ గా ఒక సినిమా చేస్తోంది. ఇది ఇలా ఉండగా ఆమె మళ్ళీ మరోసారి ప్రత్యేక గీతంలో మహేష్ సరసన నర్తించనుంది.

మహేష్ కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం పూజ హెగ్డే హీరోయిన్. కాగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో మహేష్ సరసన తమన్నాను ఖరారు చేశారు. ఈ విషయం తమన్నా నే స్వయంగా చెప్పింది. ఇప్పటికే పలు మార్లు ప్రత్యేక గీతాల్లో నటించింది తమన్నా.

ఇలాంటి పాటల కోసం తక్కువ సమయంలో ఎక్కువ పారితోషకం దక్కుతుందని కూడా హీరోయిన్లు వీటికి ఒప్పుకుంటారు. ఏది ఏమైనా తమన్నా మంచి డాన్సర్ కనుక ఈ పాట సినిమాకి మరో ఆకర్షణ అవుతుంది అనడంలో సందేహం లేదు.