బ్రేకింగ్‌: రౌడీ హీరోయిన్ ఇంటిపై ఐటీ రైడ్స్‌!

గ‌త కొంత కాలంగా టాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని జీఎస్టీ అధికారులు టార్గెట్ చేస్తూ వ‌రుస దాడుల‌తో హ‌డ‌లెత్తిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ మ‌ధ్య యాంక‌ర్ అన‌సూయ‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, యాంక‌ర్ సుమ‌తో పాటు హీరో నానితో పాటు ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటిల‌పై జీఎస్టీ విభాగానికి చెందిన అధికారులు సోదాలు నిర్వ‌హించారు. దీనిపై వ‌రుస క‌థ‌నాలు టాలీవుడ్ సెల‌బ్రిటీస్‌ని ఆందోళ‌న‌కు గురిచేశాయి. ఈ సంఘ‌ట‌న మ‌ర్చిపోక‌ముందే మ‌రోసారి టాలీవుడ్‌లో జీఎస్టీ శాఖ అధికారులు సోదాల‌కు దిగ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

తాజాగా విరాజ్ పేట్‌లోని క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న ఇంటిపై జీఎప్టీ అధికారులు సోదాలు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌ష్మిక‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల‌కు సంబంధించిన విలువైన ప‌త్రాల్ని స్వాధీనం చేసుకున్నార‌ట‌. ర‌ష్మిక ప్ర‌స్తుతం ఔట్‌డోర్ షూటింగ్‌లో వుంది. ఆమె లేకుండానే ఇంట్లో సోదాలు నిర్వ‌హించిన అధికారులు విలువైన ప‌త్రాల్ని తీసుకున్నార‌ట‌.

`ఛ‌లో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక వ‌రుస విజ‌యాల‌తో క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆమె న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి వసూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.