బోయ‌పాటి నో కాంప్ర‌మైజ్ అంటున్నాడే!

ప్ర‌పంచం క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వ‌ణికిపోతోంది. ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికా దేశాల్లో జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. మ‌న దేశంలోనూ దీని ప్ర‌భావం మొద‌లైంది. దీని గ‌మ‌నించిన కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు దేశ వ్యాప్త‌గా లాక్ డౌన్‌ని విధించాయి. ఈ నెల 14న ముగుస్తుంద‌నుకున్న లాక్ డౌన్ క‌రోనా పాజిటివ్ కేసుల పెరుగుతుండ‌టంతో మే 3కు పొడిగించారు.

దీంతో చాలా సినిమాల షెడ్యూల్స్‌, రిలీజ్ డేట్‌లు మారిపోయాయి. అయితే బోయ‌పాటి మాత్రం నో కాంప్ర‌మైజ్ అంటున్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రూపొందిస్తున్నాడు. ఇటీవ‌లే కీల‌క షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఇందులో బాల‌య్య అఘోరాగా క‌నిపించ‌బోతున్నారు. ఈ వార్తే బాల‌య్య అభిమానుల‌ను షాక్ కు గురిచేస్తోంది. బాల‌య్య ఏంటీ అఘోరా ఏంట‌ని షాక‌వుతున్నారు.

ఇదిలా వుంటే మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ఇంత‌కు ముందే ఫిక్స‌య్యారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ డేట్ మారే అవకాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటే ఆ డేట్ విష‌యంలో నో కాంప్ర‌మైజ్ అని బోయ‌పాటి చెబుతున్నాడ‌ట‌. ఏంటీ కాన్ఫిడెన్స్‌. అది అయ్యే ప‌నేనా అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు బోయ‌పాటిపై సెటైర్లు వేస్తున్నారు.