ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరోయిన్‌!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` రీమేక్ ఆధారంగా తెర‌కెక్కుతున్న `వ‌కీల్‌సాబ్‌` చిత్రంతో మళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టారు. శ్రీ‌రామ్ వేణు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు కీల‌క స‌న్నివేశాల‌తో పాటు సినిమాకు కీల‌క‌మైన కోర్టు హాలు సీన్‌ల‌ని పూర్తి చేశారు.

ఈ సీన్‌ల‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌త్యేకంగా వేసిన కోర్టు హాలు సెట్‌లో పూర్తి చేశారు. ఇప్ప‌టికే మేజ‌ర్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగిపోయింది. అయితే ఇందులో ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించే హీరోయిన్‌ని ఇప్పటి వ‌ర‌కు ఫైన‌ల్ చేయ‌లేదు. దానికి సంబంధించిన స‌న్నివేశాల్నీ చిత్రీక‌రించ‌లేదు. అయితే ప‌వ‌న్‌కు జోడీగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో శృతిహాస‌న్ న‌టిస్తుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌పై చిత్ర బృందం స్పందించ‌లేదు.

దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ `గ‌బ్బ‌ర్‌సింగ్‌` కాంబినేష‌న్ రిపీట్ కాబోతోంద‌ని ఖుషీ అయ్యారు అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, త‌ను `వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టించ‌డం లేద‌ని శృతీహాస‌న్ షాకిచ్చింది. దీంతో ఫ్యాన్స్ అవాక్క‌వుతున్నార‌ట‌. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించ‌చ‌బోతోంది.