ప్రభాస్ వల్ల నాని వరుణ్ తేజ్ మధ్య ఫైట్ !

ప్రభాస్ వల్ల నాని వరుణ్ తేజ్ మధ్య ఫైట్ !

మోస్ట్ అవైటెడ్ 2019 మూవీ `సాహో` పోస్ట్‌పోన్ ఇత‌ర రిలీజ్ ల‌కు ఆటంకంగా మారిందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఈ వాయిదా ర‌ణ‌రంగం (శ‌ర్వా), ఎవ‌రు (శేష్‌) చిత్రాల‌కు క‌లిసొచ్చినా ఇత‌ర సినిమాల్ని మాత్రం డైలెమాలోకి నెట్టేసింద‌ట‌.

ముఖ్యంగా ఆగ‌స్టు 30న రిలీజ్ కి రావాల్సిన నాని `గ్యాంగ్ లీడ‌ర్` చిత్రాన్ని అనూహ్యంగా వాయిదా వేయాల్సొచ్చింది. సాహో ఆగ‌స్టు 30న వ‌స్తోంది కాబ‌ట్టి అప్ప‌టికి సైడిచ్చి సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేయాల‌ని భావిస్తోంద‌ట మైత్రి సంస్థ‌. అయితే వ‌రుణ్ తేజ్ `వాల్మీకి` కోసం సెప్టెంబ‌ర్ 13వ తేదీని లాక్ చేసింది 14 రీల్స్ సంస్థ‌. దానివ‌ల్ల నాని, వ‌రుణ్ తేజ్ మ‌ధ్య క్లాష్ త‌ప్ప‌డం లేదు. అయితే మైత్రితో 14 రీల్స్ మంత‌నాలు సాగించి రిలీజ్ తేదీల్లో మార్పులు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం గ్యాంగ్ లీడ‌ర్ టీమ్ సెప్టెంబ‌ర్ చివ‌రిలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచ‌న చేస్తోంది. అంటే సెప్టెంబ‌ర్ 20 లేదా 27 తేదీల్లో గ్యాంగ్ లీడ‌ర్ వ‌చ్చే వీలుంది. ఇక ఆ తేదీలకు రాక‌పోతే అక్టోబ‌ర్ 2న మెగాస్టార్ సైరాతో పోటీప‌డాలి. దానికంటే ఆ రెండు తేదీల్లో ఏదో ఒక‌టి లాక్ చేస్తేనే బెట‌ర్ అని ఆలోచిస్తున్నార‌ట‌. సెప్టెంబ‌ర్ చివ‌రిలో వ‌స్తే అక్టోబ‌ర్ లో ద‌స‌రా సెల‌వులు వ‌సూళ్ల‌కు అద‌న‌పు అస్సెట్ అవుతాయి. అందుకే గ్యాంగ్ లీడ‌ర్ టీమ్ ఆ దిశ‌గా ఆలోచిస్తోంది. నాని – విక్ర‌మ్ కె కాంబినేష‌న్ లో ఈ మూవీని మైత్రి సంస్థ పెద్ద బ‌డ్జెట్ తోనే తీస్తోంది. అందుకే రిక‌వ‌రీ కోసం మంచి రిలీజ్ తేదీ త‌ప్ప‌నిస‌రి అని భావిస్తోంద‌ట‌.