`పెళ్లిచూపులు` క‌మెడియ‌న్ క్లెవ‌ర్ గేమ్‌!

`పెళ్లిచూపులు` క‌మెడియ‌న్ క్లెవ‌ర్ గేమ్‌!

`పెళ్లి చూపులు` క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి కొత్త బాట ప‌ట్టాడు. `నా చావు నేను చ‌స్తా నీకెందుకు` అంటూ న‌వ్వుల పువ్వులు పూయించిన ప్రియ‌ద‌ర్శీ ఓ ప‌క్క సినిమాల్లో బిజీగా వుంటూనే మ‌రో ప‌క్క కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకున్న‌ట్టు ప్రియ‌ద‌ర్శి క్లెర్ గేమ్ మొద‌లుపెట్టాడు. క‌రోనా కేసులు పెరుగుతున్న‌ కార‌ణంగా లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

ఈ స‌మ‌యం సినిమాకు సంక‌టంగా డిజిట‌ల్ రంగానికి లాభ‌దాయ‌కంగా మారింది. లాక్‌డౌన్ కార‌ణంగా వినోదం కోసం అంతా ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు మాంచి డిమాండ్ ఏర్ప‌డింది. దీనికి తోడు సినిమా థియేట‌ర్లు ఇప్ప‌ట్లో తెరుకునే విధంగా ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డం, మ‌రో నాలుగు నెల‌ల పాటు ఎదురుచూడ‌క త‌ప్ప‌ద‌ని నిపుణులు చెబున్నారు.

దీంతో టాలీవుడ్‌లో చాలా మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా `పెళ్లిచూపులు` క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి కూడా వెబ్ సిరీస్ బాట‌ప‌ట్టాడు. ద‌ర్శి న‌టించిన తొలి వెబ్ సిరీస్ `లూజ‌ర్‌`. ప్రియ‌ద‌ర్శితో పాటు శ‌శాంక్‌, `రాజ‌న్న‌` అనీ, క‌ల్పిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జీ5లో ఈ వెబ్ సిరీస్ మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రియ‌ద‌ర్శి ప్ర‌స్తుతం న‌టించిన `వి` రిలీజ్‌కి రెడీగా వుంది. రాహుల్ రామ‌కృష్ణ‌, న‌వీన్ పొలిశెట్టితో క‌లిసి న‌టిస్తున్న `జాతిర‌త్నాలు` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.