నెల రోజుల త‌రువాత నిద్ర‌లేచింది!

నెల రోజుల త‌రువాత నిద్ర‌లేచింది!

క‌రోనా వైర‌స్ నుంచి జ‌నాల‌ని ర‌క్షించ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ముందుగా మార్చి 22న విధించింది. ఆ రోజు స‌క్సెస్ కావ‌డంతో లాక్‌డౌన్‌ని త‌రువాత రోజు నుంచి ప్రారంభిస్తున్నామంటూ స‌డెన్‌గా ప్ర‌క‌టించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించ‌డంతో ఆ రోజు నుంచి జ‌న జీవితం స్థంభించిపోయింది. సోష‌ల్ డిస్టెన్స్‌లో భాగంగా చాలా మంది ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు.

ఆ రోజు నుంచి సోష‌ల్ మీడియాకు బైబై చెప్పేసింది స‌మంత‌. ఎవ‌రు ఎలాంటి పోస్ట్‌లు పెడుతున్నా స్పందించ‌కుండా సోష‌ల్ డిస్టెన్స్‌ని పాటించింది. సీసీసీకి స్టార్ హీరోయిన్‌లు డొనేష‌న్‌లు ఇవ్వ‌డం లేద‌ని బ్ర‌హ్మాజీ బ‌హిరంగంగా కామెంట్‌లు చేసినా సామ్ ప‌ట్టించుకోలేదు.. స్పందించ‌లేదు కూడా. కానీ తాజాగా స్పందించింది.

ఇన్‌స్టా వేదిక‌గా ఓ ఫొటోని షేర్ చేసిన స‌మంత `ఈ రోజే దీర్ఘ నిద్ర నుంచి తిరిగి వ‌చ్చాను. ఇంట్లోనే వుండండి.. క్షేమంగా వుండండి.. మీ కోసం ప్రార్థిస్తున్నాను` అని పోస్ట్ చేసింది. `జాను` ఫ్లాప్ కావ‌డంతో కొంత నిరాశ‌కు గురైన స‌మంత త్వ‌ర‌లో అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ బైలింగ్వ‌ల్ సినిమాకు ఓకే చెప్పేసింది. తాజా క‌న్న‌డ చిత్రం `దియా`ని కూడా రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.