నాని – దిల్ రాజు మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

నాని తొలిసారి నెగెటివ్ షేడ్స్ వున్న పాత్ర‌లో న‌టించిన చిత్రం `వి`. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మ‌రో హీరోగా సుధీర్‌బాబు న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై హైప్‌ని తీసుకొచ్చాయి. అయితే ఏదైనా హాలీవుడ్ లేదా కొరియ‌న్ చిత్రాన్ని ఏమైనా ఫ్రీమేక్ చేశారా? అనే అనుమానాన్ని కూడా క‌లిగించింది.

అదితీరావు హైద‌రీ, నివేదా థామ‌స్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేయాల‌నుకున్నారు. నాని కూడా ఇదే డేట్‌కి ఫిక్స్ అయ్యాడు. కానీ దిల్ రాజు మాత్రం మ‌రింత ఆల‌స్యంగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇదే ఇద్ద‌రి మ‌ధ్య ఇడ్డందిక‌ర వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంది. దీనికితోడు రిసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాల‌కు అంత‌గా క‌లెక్షన్స్ లేక‌పోవ‌డం, క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల `వి` రిలీజ్‌ని వాయిదా వేయాల‌ని దిల్ రాజు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యార‌ట‌.

దిల్ రాజు నిర్ణ‌యం మార‌డానికి ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా ఓ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. విదేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు ఇప్పుడిప్పుడే న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓవ‌ర్సీస్ మార్కెట్ మ‌రీ డ‌ల్‌గా వుండే అవ‌కాశం వుంద‌ని రిలీజ్ డేట్‌ని మార్చ‌మ‌ని చెప్పార‌ట‌. దీంతో దిల్ రాజు `వి` చిత్ర రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసిన‌ట్టు తెలిసింది.