నాగ చైతన్య సరసన రష్మిక?

రష్మిక మందన్న అనతి కాలంలోనే తెలుగులో అగ్ర హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది. ప్రస్తుతం మహేష్ సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ తో పాటు నితిన్ సరసన ‘భీష్మ’ లో నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈమె నాగ చైతన్య సరసన నటించనుంది. ఈ చిత్రం టైటిల్ ‘అదే నువ్వు అదే నేను’. అసలైతే ఈ చిత్రం మహెహ్స్ మేనల్లుడు అశోక్ తో చేశారు కానీ కొన్ని కారణాల వాళ్ళ ఆ ప్రాజెక్ట్ నిలిచి పోయింది.

దాంతో అశోక్ స్థానంలో నాగ చైతన్యను తీసుకుని ప్రాజెక్ట్ ముందుకు వెళ్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఒక కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆ పైన రష్మిక అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వం చేసే సినిమాలో అవకాశం దక్కించుకుంది.