ధ‌నుష్ గ్యాంగ్‌స్ట‌ర్‌ మూవీ టైటిల్ ఇదే!

విభిన్న‌మైన చిత్రాల‌తో హీరోగా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు త‌మిళ హీరో ధ‌నుష్‌. ఇటీవ‌ల `అసుర‌న్‌` హిట్‌తో రెట్టించిన ఉత్సాహంలో వున్న ధ‌నుష్ త‌న తాజా చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయ‌బోతున్నాడు. `పిజ్జా` ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ సినిమా చేస్తున్నాడు. ధ‌నుష్ న‌టిస్తున్న 40వ చిత్ర‌మిది. మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కానుంది. భారీ బ‌డ్జెట్‌తో వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎస్‌. శ‌శికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదే నిర్మాత ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. త‌మిళంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సంచ‌నా న‌ట‌రాజ‌న్‌, ఐశ్వ‌ర్య లక్ష్మి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో హైలాండ‌ర్‌, బ్రేవ్ హార్ట్‌, ట్రాయ్‌, ద క్రానిక‌ల్స్ ఆఫ్ నార్నియా, బెన్‌హ‌ర్‌, గేమ్ ఆఫ్ త్రోన్స్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో న‌టించిన జేమ్స్ కాస్మోస్ ఈ చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్న‌ట్టు తెలిసింది. లండ‌న్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి త‌మిళంలో `జ‌గ‌మే తంతిరం` అని పేరు పెట్టారు. తెలుగులో మాత్రం `జ‌గ‌మే తంత్రం` అనే టైటిల్‌ని బుధ‌వారం రాత్రి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. మే 1న తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.