ద‌ర్శ‌కుడికి నిర్మాత అదిరిపోయే గిఫ్ట్ ఎందుకంటే?

నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌. `అల్లుడు శీను` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ చిత్రంతో మంచి హిట్ అందుకున్నా. ఆ త‌ర్వాత చేసిన చిత్రాలేవి పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోలేక‌పోయాయి. త‌మిళ‌నాట ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కించిన రాక్ష‌స‌న్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మ‌రి ఈ చిత్రం తెలుగులో రాక్ష‌సుడుగా రీమేక్ చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో మంచి విజ‌యం సాధించి బాక్సాఫీస్ ముందు అద్భుత‌మైన క‌లెక్షన్ల‌ను సంపాదించింది. ఈ చిత్రానికి కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఈ చిత్రం బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ కెరియ‌ర్‌లోనే అతి పెద్ద హిట్ అని చెప్పుకోవ‌చ్చు. గ‌తంలో ఆయ‌న ఎంత హై బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఇంత పెద్ద హిట్ అయితే సాధించ‌లేక‌పోయారు. రాక్ష‌స‌న్ చిత్రం ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్. ఆ చిత్రాన్ని యాధావిధిగా తెలుగులో ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కించారు. క‌థలో క‌థ‌నంలో ఎక్క‌డా మార్పులు చేర్పులు లేకుండా తెర‌కెక్కించ‌డంతో ఇంత పెద్ద విజ‌యం సాధించింది.
ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత కోనేరుస‌త్య‌నారాయ‌ణ‌కు మంచి కలెక్ష‌న్ల ప‌రంగా భారీ మొత్తంలో లాభాలు వ‌చ్చాయి. అందుకు ర‌మేష్ వ‌ర్మ‌కు ఈ చిత్ర నిర్మాత ఒక కాస్టీ గిఫ్ట్ ఇచ్చారు. అదేమిటి అనుకుంటున్నారా? ఓ అపురూపమైన బహుమతి ప్రదానం చేశారు.. జూబ్లీహిల్స్ లోని అయ్యన్న పెరల్ లో 3 కోట్ల విలువైన ఫ్లాట్ ను బహుమతి గా ఇచ్చారు. ఇంత కాస్టీ గిఫ్ట్ ఇచ్చినందుకు ఆ ద‌ర్శ‌కుడు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే…బెల్లంకొండ త్వరలో మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కందిరీగ ఫేం సంతోష్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌తో రెడీ అయ్యాడు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయి శ్రీనివాస్‌ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ముందుగా ఈ కాంబినేషన్‌లో తమిళ సూపర్‌ హిట్ తెరీ సినిమాను రీమేక్‌ చేయాలని భావించారు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాకపోవటంతో కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు.