ద‌ద్ధ‌రిల్లిపోయే చ‌ప్ప‌ట్ల‌తో రీసౌండ్‌..!

క‌రోనా ర‌క్క‌సి కాటేస్తోంది. ఏ క్ష‌ణం ఎవ‌రికి సోకుతుందో తెలియ‌ని అయోమ‌యం. నివార‌ణను మించి మందు లేదు. సామాన్యుడి స్థాయి నుంచి కోటీశ్వ‌రుడి వ‌ర‌కు ఒక‌టే టెన్ష‌న్ క‌రోనా. ఏ ఒక్క‌రినీ విడిచి పెట్ట‌డం లేదు. దీంతో అంతా భ‌యంతో వ‌ణికిపోతున్నారు. సెల‌బ్రిటీలు క‌రోనా జాగ్ర‌త్త‌లు ఇలా తీసుకోండ‌ని అంద‌రికి వీడియోల రూపంలో సందేశాలిస్తున్నారు. ఈ ఆదివారం దేశ వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యించారు.

ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఈ జ‌న‌తా క‌ర్ఫ్యూ ఉంటుంది. దీనికి అంతా మ‌ద‌త్తు ఇవ్వాల‌ని క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాల‌ని సెల‌బ్రిటీలు ముక్త కంఠంతో కోరుతున్నారు. ప్ర‌ధాని మాట పాటిద్దాం, క‌రోనా విముక్త భార‌తాన్ని సాదిద్దాం అని ప‌వన్‌క‌ల్యాణ్ పిలుపునిచ్చారు.

హీరో మ‌హేష్ కూడా మ‌ద్దుతునిచ్చారు, మ‌న‌ల్ని ర‌క్షించ‌డానికి క‌రోనాపై ఫైట్ చేస్తున్న వారంద‌రికి సెల్యూట్ చేద్దాం. ప్ర‌ధాని చెప్పిన‌ట్టు మ‌న బాల్క‌నీలో నిల‌బ‌డి ద‌ద్ధ‌రిల్లిపోయేలా చ‌ప్ప‌ట్ల రీసౌండ్‌తో వారిని గౌర‌వించుకుందాం. అంద‌రూ సుర‌క్షితంగా ఆరోగ్యంగా వుండండి` అని మ‌హేష్ సోష‌ల్ మీడియా ట్విట్టర్ ద్వారా సందేశాన్ని అందించారు.