దిల్ రాజు కోసం మైత్రీని పక్కన పెట్టిన దేవరకొండ

దిల్ రాజు కోసం మైత్రీని పక్కన పెట్టిన దేవరకొండ

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కీల‌క ముంబై షెడ్యూల్‌ని పూర్తి చేసింది. త‌దుప‌రి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో స్టార్ట్ కావాల్సింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ ర‌ద్దు చేశారు. ఇదిలా వుంటే దిల్ రాజు సినిమా కోసం మైత్రీ మూవీమేక‌ర్స్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ హ్యాండ్ ఇచ్చేశాడ‌ట‌.

మైత్రీలో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస‌గా రెండు చిత్రాలు చేయాల‌ని అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో భాగంగా ముందు `డియ‌ర్ కామ్రేడ్‌` చిత్రాన్ని చేశాడు. ఆ త‌రువాత త‌మిళ ద‌ర్శ‌కుడు అనంద్ అన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో `హీరో` పేరుతో సినిమా ప్లాన్ చేశారు. మాళ‌వికా మోహ‌న‌న్ని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఓపెనింగ్ కూడా జ‌రిగింది. కొంత షూటింగ్ కూడా చేశారు. మైక్ రేస‌ర్‌గా విజ‌య్ దేవ‌రకొండ క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేశారు. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు కానీ అనంద్ అన్నామ‌లై టేకింగ్ ఏ మాత్రం మేక‌ర్స్‌కి న‌చ్చ‌లేదు. దీంత ఈ చిత్రాన్ని మ‌ధ్య‌లోనే ఆపేశారు.

అయితే ఈ మూవీ ప్లేస్‌లో మ‌రో సినిమా చేస్తాన‌ని విజ‌య్ మైత్రీ వారికి మా‌టిచ్చాడ‌ట. ఆ స్థానంలోకి ఇప్పుడు దిల్ రాజు సినిమా వ‌చ్చి చేరింది. శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా దిల్ రాజు ఓ సినిమాని ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీని త‌రువాతే మైత్రీ వారికి సినిమా చేయాల‌ని విజ‌య్ ఫిక్స‌య్యాడ‌ట‌. దీంతో చేసేదేమి లేక మైత్రీ వారు సైలెంట్ అయిపోయిన‌ట్టు తెలిసింది.