దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం..

దర్శకుడు సందీప్ రెడ్డి కి మాతృ వియోగం…!!

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుఝామున సందీప్ రెడ్డి వంగ తల్లి వంగ సుజాత కన్నుమూసారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె ఈ రోజు తెల్లవారుఝామున ఆమె సొంతిల్లు వరంగల్‌లోని మరీ వెంకటయ్య కాలనీలో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే సందీప్ రెడ్డి వరంగల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. పలువురు సినిమా ప్రముఖులు సందీప్ రెడ్డి గారి తల్లి మరణం పై వారికీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

సందీప్ రెడ్డి తెలుగులో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరో, హీరోయిన్లుగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్స్ లో ఒకడు అయ్యాడు. మరోవైపు ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరాడు. తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసిన అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.