త్రిషకు సంబంధించి ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌!

trisha , Mohanlal Movie shooting starts

కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా మంది టాలీవుడ్  స్టార్ హీరోలు షూటింగులకు రావడానికి  జంకుతున్నారు.  త్రిష మాత్రం ధైర్యంగా షూటింగ్‌కి హాజరవుతోందట.  కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా త్రిష తమిళంలో మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది .త్రిష సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీ గా ఉంది. ప్రస్తుతం త్రిష నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆమె చేతిలో మరో నాలుగు  ప్రాజెక్ట్ ఉన్నాయి. తమిళ్ లో త్రిష నటించిన ‘పారపాధమ్ విలయాట్టు’, ‘గర్జనై’ సినిమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. త్రిష మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తోంది . అలాగే ‘రాంగీ’, ‘షుగర్’ అనే సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి.

వీటితో పాటు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ అప్‌కమింగ్ మూవీ ‘రామ్’లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా వల్ల  ఆగిన ‘రామ్’ షూటింగ్ కేరళ లో మళ్ళీ ప్రారంభమైంది. త్రిష కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటోంది. అందరు స్టార్లు కరోనా నేపథ్యంలో బయటకు రావడానికి కూడా భయపడుతుంటే త్రిష మాత్రం ధైర్యంగా షూటింగ్‌కి హాజరవుతోందట. దీంతో ఈ విషయం ఇప్పుడు తమిళ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.