గోపీచంద్ మ‌ళ్లీ ఆ దారిలోకి వెళుతున్నాడా?

గోపీచంద్ హీరోగా ఎంట‌రైన చిత్రం `తొలి వ‌ల‌పు`. ముత్యాల సుబ్బ‌య్య తెర‌కెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో న‌టుడిగా గుర్తింపును సొంతం చేసుకోవాల‌ని గోపీచంద్ కొత్త‌దారి ప‌ట్టాడు. అదే తేజ `జ‌యం`తో విల‌న్‌గా కొత్త అవ‌తారం ఎత్తాడు. ఆ సినిమా అనూహ్య విజ‌యాన్ని సాధించి న‌టుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత నిజం, వ‌ర్షం చిత్రాల్లో విల‌న్‌గా న‌టించాడు. `య‌జ్ఞం` చిత్రంతో మ‌ళ్లీ హీరోగా సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టాడు.

తాజాగా మ‌ళ్లీ గోపీచంద్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న త‌మిళ చిత్రం `అన్నాతే`. తెలుగులో ఈ చిత్రానికి `అన్న‌య్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `సిరుతై` శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో కెమెరామెన్‌గా వున్న శివ తెలుగులో `శౌర్యం` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇందులో హీరో గోపీచంద్‌. ఆ ప‌రిచ‌యంతో గోపీచంద్‌ని ర‌జ‌నీకాంత్ చిత్రంలో విల‌న్‌గా న‌టింప‌జేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్త‌ల‌పై మాత్రం గోపీచంద్ టీమ్ స్పందించ‌డం లేదు. ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్న‌మూ చేయ‌డం లేదు. అంటే గోనీచంద్ మ‌ళ్లీ విల‌న్‌గా పాత దారికే వెళుతున్నాడా? లేక రూమ‌ర్స్‌పై స్పందించ‌డం ఎందుక‌ని వివ‌ర‌ణ ఇవ్వ‌డం లేదా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.